డాలర్ శేషాద్రి మృతి పట్ల సీఎం వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
29 Nov, 2021 10:20 IST
తాడేపల్లి: డాలర్ శేషాద్రి మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ సోమవారం ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు.