ఇస్రో బృందానికి సీఎం వైయస్ జగన్ అభినందనలు
31 Jul, 2023 10:14 IST
తాడేపల్లి: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో బృందానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఏడు ఉపగ్రహాలతో విజయవంతంగా రాకెట్ను ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సీఎం వైయస్ జగన్ ఆకాంక్షించారు.