తాడేపల్లి: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడి అకాల మరణం పట్ల సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ట్వీట్ చేశారు. సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి గారి కుమారుడి మరణ వార్త నన్ను కలిచివేసింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం వైయస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.