కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర కోడుమూరు చేరుకుంది. కోరుమూరులో ముఖ్యమంత్రి వైయస్ జగన్కు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షంతో జననేతకు ఘనస్వాగతం పలికారు. జై జగన్ అంటూ నినదిస్తూ యాత్రలో పాల్గొన్నారు. కోడుమూరు ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందుకు సాగారు. దారిపొడవునా బారులు తీరిన జనానికి బస్సు పైకి ఎక్కి ప్రజాభివందనం చేస్తూ సీఎం వైయస్ జగన్ యాత్ర కొనసాగిస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా అభిమాన నేతను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు.