కర్నూలు: పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహా వేడుకకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. కర్నూలు మండలం పంచలింగాల మాంటిస్సోరి ఒలంపస్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై వరుడు శివనరసింహారెడ్డి, వధువు రూపశ్రీలను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించారు. వివాహానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైయస్ఆర్ సీపీ శ్రేణులు హాజరయ్యారు.