విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) వై. మధుసుధన రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశీర్వదించారు. నూతన వధూవరులు తేజశ్రీ, అర్జున్లకు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.