నూతన వధూవరులకు ఆశీర్వాదం
27 Feb, 2020 14:19 IST
కర్నూలు: పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్రెడ్డి వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. రాగ మయూరి రిసార్ట్స్లో జరిగిన వివాహా వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, సాయిప్రసాద్ రెడ్డి, బాల నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్ ఖాన్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, చల్లా రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, బీవై రామయ్య తదితరులు ఉన్నారు. అంతకు ముందు గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్కు ప్రజా ప్రతినిధులు, వైయస్ఆర్ సీపీ నాయకులు ఘనంగా స్వాగతం కలిపారు.