చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోన్రెడ్డి రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు స్వాగతం పలికేందుకు ఈ మేరకు తాడేపల్లి నుంచి రేణిగుంట ఎయిర్పోర్టుకు సీఎం చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో సీఎం వైయస్ జగన్కు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.