ఒడిశా: ఒడిశా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భువనేశ్వర్ చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్కు ఆ రాష్ట్ర ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ కానున్నారు. ఉభయ రాష్ట్రాల అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్చించనున్నారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించనున్నారు. నేరడి బ్యారేజీతో ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను వివరించనున్నారు.