మున్సిపల్ కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించండి
11 Jul, 2022 16:49 IST
తాడేపల్లి: మున్సిపల్ కార్మికుల సమ్మె సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కార్మికుల సమస్య పరిష్కరించేందుకు హైపర్ కమిటీని నియమించారు. ఈ కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్శర్మ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మె పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని హైపవర్ కమిటీని ఆదేశించారు.