తాడేపల్లి: విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మేరకు విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం వైయస్ జగన్ పలు కీలక నిర్ణయాలను తీసుకోన్నారు.