కందుకూరి వీరేశలింగం పంతులు సేవలు చిరస్మరణీయం
16 Apr, 2023 18:36 IST
తాడేపల్లి: సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు’’ అని సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.