ద్రోణంరాజు శ్రీనివాస్ మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం
4 Oct, 2020 18:53 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ శాసన సభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ద్రోణంరాజు మరణం విశాఖ ప్రజలకు తీరనిలోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం వైయస్ జగన్ తెలిపారు.