హైకోర్టు సీజేకు సీఎం దంపతుల పరామర్శ
15 Aug, 2022 11:57 IST
విజయవాడ: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రాను సీఎం వైయస్ జగన్ దంపతులు పరామర్శించారు. ఇటీవల జస్టిస్ మిశ్రా తల్లి నళినీ మిశ్రా కన్ను మూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైయస్ జగన్, ఆయన సతీమణి వైయస్ భారతి ఆదివారం విజయవాడలోని సీజే నివాసానికి వెళ్లి పరామర్శించారు.