మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ పరామర్శ
21 Nov, 2020 13:16 IST
మచిలీపట్నం: ఇటీవలే మాతృ వియోగం పొందిన రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి మచిలీపట్నం వెళ్లారు. ఈ సందర్భంగా సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.