ముగిసిన కేబినెట్ సమావేశం
28 Oct, 2021 13:12 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కేబినెట్ భేటీలో దేవాదాయ శాఖ చట్ట సవరణల , గుట్కా నిషేదానికి చట్ట సవరణ, ఫిలిమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తోంది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు, అమ్మ ఒడి పథకం అమలు , రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా, ఇవాళ సాయంత్రం సీఎం వైయస్ జగన్.. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్తో సమావేశం కానున్నారు.