సీఎం వైయస్ జగన్ను కలిసిన సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్
24 Jan, 2023 17:05 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను కలిసిన సంజయ్..తనను సీఐడీ చీఫ్గా నియమించడం పట్ల సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఏపీ సీఐడీ చీఫ్గా ఎన్. సంజయ్ను ప్రభుత్వం నియమించిన విషయం విధితమే.