సీఎంను కలిసిన నూతన సీఎస్
1 Jan, 2021 13:50 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యత చేపట్టారు. అనంతరం నూతన సీఎస్ ఆదిత్యనాథ్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిశారు. పుష్పగుచ్ఛం అందజేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన సీఎస్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన నీలం సాహ్ని ఉన్నారు.