హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నాం 

22 Sep, 2022 15:53 IST

తాడేపల్లి: హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గృహనిర్మాణంలో ప్రగతిపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సమగ్రంగా సమీక్షించారు. గత సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు తీరునుకూడా వివరించిన అధికారులు.

2022–23 ఆర్ధిక సంవత్సవరంలో ఇప్పటివరకూ రూ. 4,318 కోట్ల విలువైన పనులుచేశామని వివరించిన అధికారులు.
తొలివిడతలో 15.6 లక్షలు, రెండో విడతలో 5.65 లక్షలు మొత్తంగా 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపిన అధికారులు.
వర్షాలు తగ్గగానే ప్రతి వారం కూడా ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటుందని, అక్టోబరు నుంచి వారానికి 70వేల ఇళ్ల చొప్పున ఒక దశ నుంచి వేరే దశకు నిర్మాణం అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకున్నామన్న అధికారులు.

ఆప్షన్‌ –3 ( ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలన్న) ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు కూడా వేగవంతం చేస్తున్నామన్న అధికారులు.
ప్రతివారంకూడా నిర్మాణ సంస్థలతో సమీక్ష చేస్తున్నామన్న అధికారులు.
 
ఈ సందర్భంగా సీఎం  వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నాం: సీఎం
ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలి: సీఎం
గృహనిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టండి:
ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్న సీఎం 
ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి జగనన్న కాలనీల్లో డ్రైనేజీ, కరెంటు, తాగునీరు లాంటి కనీస వసతులు కల్పించాలన్న సీఎం.
కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దన్న సీఎం. 
కాలనీల పరంగా ప్రాధాన్యతా పనులపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుని, ఆమేరకు పనులు చేపట్టాలని సీఎం ఆదేశం.

టిడ్కో ఇళ్లపై సీఎం సమీక్ష.
ఇప్పటికే పనులు పూర్తయిన వాటిని లబ్ధిదారులకు అందిస్తున్నామన్న అధికారులు.
డిసెంబరు నాటికి అన్నింటినీ కూడా లబ్ధిదారులకు అందిస్తామన్న అధికారులు.
సీఎం ఆదేశాల మేరకు టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయ కల్పనా పనులు అత్యంత నాణ్యతతో చేపడుతున్నామన్న అధికారులు.
టిడ్కో ఇళ్ల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టిపెట్టామన్న అధికారులు.
టిడ్కో ఇళ్ల నిర్వహణపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం. 

 దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పట్టాలు అందించే కార్యక్రమంపైనా సీఎం సమీక్ష.
– ఇప్పటికే 96.8 వేల మందికి పట్టాలు ఇచ్చామన్న అధికారులు.
– మరో 1.07 లక్షల మందికి పట్టాలు ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నామన్న అధికారులు.

ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ప్రన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్సు ఆనంద కుమర్‌ జా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, సర్వే సెటిల్మెంట్స్‌ అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్ధార్ధ జైన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ,  ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.