సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. రంజాన్ ఇచ్చే సందేశం 

21 Apr, 2023 22:49 IST

తాడేప‌ల్లి: సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. రంజాన్ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  వైయస్‌. జగన్‌ శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు.  ఈ మేర‌కు సీఎంవో కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
    మానవాళికి హితాన్ని బోధించే రంజాన్‌ పండుగ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు.

    
- కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ
- దానధర్మాలతో దాతృత్వం
- సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని ముఖ్యమంత్రి అన్నారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. 

మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని ముఖ్యమంత్రి తన సందేశంలో తెలిపారు.