ఈసీని కలిసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

1 Mar, 2019 17:55 IST

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికల కమిషన్‌ను కలిశారు. అక్రమంగా ఓట్లు తొలగింపుపై ఈసీకి చెవిరెడ్డి ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో ఓట్లను తొలగించేందుకు అనుసరిస్తున్న టీడీపీ కుట్రలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపు ఆదేశాల టెలీకాన్ఫరెన్స్‌ ఆడియో ఆధారాలను చెవిరెడ్డి ఈసీకి అందజేశారు.