సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం
7 Mar, 2022 14:21 IST
సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం, బీఏసీ సమావేశం అనంతరం కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సమావేశం ప్రారంభానికి ముందు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతికి ముఖ్యమంత్రి వైయస్ జగన్, మంత్రి మండలి సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.