సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెలలోనే ఎన్నికల నిర్వహణ సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయస్ జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చించనున్నట్లు సమాచారం.