పెగాసస్ అంశంపై చర్చ జరగాలి
21 Mar, 2022 09:48 IST
అమరావతి: అసెంబ్లీలో పెగాసస్ అంశంపై చర్చ జరగాలని, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. పెగాసస్పై కమిటీ వేసి సుప్రీం దర్యాప్తు చేపట్టిందన్నారు. చంద్రబాబు హయాంలోనే పెగాసస్ను వాడారని బెంగాల్ సీఎం చెప్పారని మంత్రి అన్నారు. పెగాసస్ సాప్ట్వేర్ ద్వారా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశముందన్నారు. పెగాసస్పై చర్చించి కమిటీకి రిపోర్ట్ చేయాల్సి బాధ్యత ఉందని మంత్రి అన్నారు.