బ్రహ్మానందరెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
8 Mar, 2019 18:51 IST
హైదరాబాద్: కర్నూలు జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇవాళ మాజీ ఎమ్మెల్యే చెల్లా రామకృష్ణారెడ్డి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా, కొద్ది సేపటికే జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పోచా బ్రహ్మానందరెడ్డి చేరారు. ఆయనకు వైయస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్రెడ్డి, గంగుల నాని తదితరులు పాల్గొన్నారు.