కర్నూలు: భారతీయ జనతా పార్టీ నేతలు దారుణానికి తెగబడ్డారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై బీజేపీ నేతలు వేట కొడవళ్లు, పెట్రోల్తో దాడి చేశారు. ఈ దాడిలో శివప్ప, ఈరన్న అనే ఇద్దరు వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు.