హైకోర్టులో వైయస్ఆర్‌సీపీ నాయ‌కుల‌కు ఊర‌ట‌

7 Mar, 2025 11:35 IST

తాడేప‌ల్లి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని)కి ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఏ6గా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ విక్రాంత్‌ రెడ్డికి కూడా కోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.