అరటి రైతు పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన
8 Jul, 2019 14:00 IST
వైయస్ఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్రెడ్డి పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో అరటి సాగు చేసిన రైతులు ఏటేటా నష్టాలు ఎదుర్కొంటుండటంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైతు దినోత్సవం సందర్భంగా వైయస్ జగన్ అరటి పరిశోధన కేంద్రానికి శ్రీకారం చుట్టారు. దీంతో అరటీ రైతులు హర్షం వ్యక్తం చేశారు.