వైయస్సార్ కడప: బద్వేల్ శాసన సభ్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం ఉంటున్న కో ఆపరేటివ్ కాలనీలోని వందన అపార్ట్మెంట్ నుంచి అంతిమయాత్ర మొదలైంది. ఈ అంతిమయాత్ర ఇందిరానగర్ సమీపంలోని నర్సింగ్ కాలేజీ పక్కనున్న ఎమ్మెల్యే వ్యవసాయ పొలం వరకు సాగుతుంది. అనంతరం ప్రభుత్వ లాంఛనాల మధ్య ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు జరుగుతాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, నిన్న సీఎం వైయస్ జగన్ కడప నగరంలోని వెంకట సుబ్బయ్య పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతికి తెలిపారు.