బద్వేల్ ఉప ఎన్నికపై విస్తృత స్థాయి సమావేశం
వైయస్ఆర్ జిల్లా: బద్వేల్ ఉప ఎన్నికపై వైయస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని బూత్ కన్వీనర్లతో పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ బేటీ అయ్యారు. ఈ సమావేశానికి వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు ఈ నెల 1వ తేదీ నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
బద్వేలు పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు... 2,12,739 మంది ఓటర్లు
బద్వేలు నియోజకవర్గ పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటి పరిధిలో జనవరి, 2011వ తేదీ నాటికి 2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,06,650 మందికాగా 1,06,069 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. తాజాగా కొత్త ఓటర్ల జాబితా వెలువడనుంది. ఆమేరకు ఉప ఎన్నిక జరగనుంది.