తాడేపల్లి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హజరయ్యారు. ఈనెల 26 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.