ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
15 Sep, 2022 11:30 IST
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో తీర్మానించారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి, సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, చీఫ్ విప్ ప్రసాదరాజు, శ్రీకాంత్రెడ్డి, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు.