అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా బాధ్యతలు నిర్వర్తించిన నన్నపనేని రాజకుమారి రాజీనామా చేయడంతో వాసిరెడ్డి పద్మకు ఆ బాధ్యతలు అప్పగించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా సమర్థవంతంగా బాధ్యతలు చేపట్టిన వాసిరెడ్డి పద్మ.. నిత్యం టీడీపీ సర్కారును ఇరుకున పెట్టేలా మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు వాసిరెడ్డి పద్మకు శుభాకాంక్షలు తెలిపారు.