అనంతపురం: రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన అనంతపురంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 804 ఎంపీటీసీ స్థానాలకు గాను (ఏకగ్రీవాలతో కలిపి) వైఎస్సార్ సీపీ 214 చోట్ల విజయం సాధించగా టీడీపీ కేవలం 03 స్థానాల్లోనే గెలిచింది. బీజేపీ ఖాతా తెరవలేదు. 63 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్ సీపీ 35, బీజేపీ, ఇతరులు ఇంకా ఖాతా తెరవలేదు .