విశాఖపట్నం: జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాను గాలి వీస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభంజనానికి ప్రతిపక్షాలు గల్లంతయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 39 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆదివారం వెలువడుతున్న ఫలితాల్లో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో వైఎప్సార్సీపీ ఒక స్థానం గెలుచుకోగా ప్రతిపక్షాలు ఒక్కటీ దక్కలేదు. ఇక 651 ఎంపీటీసీ స్థానాలకు గాను (ఏకగ్రీవాలతో కలిపి)వైఎస్సార్సీపీ ఏకంగా 83 స్థానాలు గెలుచుకోగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు ఒక స్థానంలో గెలిచారు.