తాడేపల్లి: రాష్ట్రంలో ఇక ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలో భేటీ అయిన ఏపీ కేబినెట్ కొత్త ఇసుక పాలసీకి ఆమోదముద్ర వేసింది. కొత్త ఇసుక పాలసీ ప్రకారం అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది.ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వస్తే... రాష్ట్రంలో ఇసుక కష్టాలు తీరే అవకాశం ఉంది.