వైయస్ఆర్ జిల్లా: కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబుకు రాయలసీమలో పర్యటించే హక్కులేదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హెచ్చరించారు. చంద్రబాబును ఎవరూ నమ్మరని, 14 ఏళ్లలో ఏం చేశారో అందరూ చూశారని అన్నారు. వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు నిజమే అన్నారు. చంద్రబాబుకు రైతులు గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు తలకిందులు తపస్సు చేసిన ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు మాటలకు, పనులకు పొంతన ఉండదని అంజాద్ బాషా ధ్వజమెత్తారు.