రంగుల పండుగ అందరి జీవితాల్లో శాంతిసౌఖ్యాలు నింపాలి
9 Mar, 2020 12:31 IST
అమరావతి: రంగుల పండుగ అందరి జీవితాల్లో శాంతిసౌఖ్యాలు నింపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. హోలి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరు ఆనందకరమైన, సురక్షితమైన, రంగుల హోలీ జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.