చేనేత పరిశ్రమ మన దేశ సంస్కృతికి ప్రతిబింబం
7 Aug, 2019 12:31 IST
అమరావతి: చేనేత పరిశ్రమ మన దేశ సంస్కృతికి ప్రతి బింబమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చేనేత పరిశ్రమ మన దేశ సంస్కృతికి ప్రతిబింబమని, స్వదేశీ ఉద్యమం ద్వారా జాతిని ఏకం చేసిన చరిత్ర చేనేతలదన్నారు. చేనేతల అభ్యున్నతికి చిత్తశుద్ధితో ఉన్నామని, రాష్ట్ర బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించామని సీఎం వివరించారు.