రోశయ్య మృతి పట్ల సీఎం వైయస్ జగన్ సంతాపం
4 Dec, 2021 10:31 IST
తాడేపల్లి: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం (88) కన్నుమూశారు. బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.