సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన రద్దు
25 Sep, 2021 10:43 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శనివారం నాటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం వైయస్ జగన్కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.