విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష
26 Jun, 2019 12:47 IST
అమరావతి: రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్, ఇంధన శాఖల అధికారులతో సమావేశం ప్రారంభమైంది. వైయస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతులకు పగటి పూట ఉచిత విద్యుత్ 9 గంటలు ప్రభుత్వం ఇవ్వనుంది. కాగా, ఇప్పటికే 60 శాతం ట్రయల్ రన్ కూడా పూర్తయింది. మిగిలిన 40 శాతానికి సంబంధించి సీఎం వైయస్ జగన్ అధికారులతో చర్చిస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై చర్చ కొనసాగుతోంది.