కాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం
3 Nov, 2023 10:46 IST
సచివాలయం: కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి భేటీ కానుంది. నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలకు, రూ. 19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేయనుంది.