సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకూ నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో శాసన సభలో ప్రవేశ పెట్టాల్సిన ముసాయిదా బిల్లులపై మంత్రి వర్గం చర్చించింది. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ ఆమోదించిన కీలక అంశాలు..
– ఈ నెల 29న విద్యాదీవెన కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం
– ఏపీ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, బోర్డ్లో 8 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
– శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో బిల్లుకు కేబినెట్ ఆమోదం.
– ఎస్పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన కొత్త పరిశ్రమలకు గ్రీన్సిగ్నల్.
– మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 సవరణల బిల్లుకు కేబినెట్ ఆమోదం.
– ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ – 1955 చట్టంలో సవరణలకు ఆమోదం.
– ఏపీ హైకోర్టులో మీడియేషన్ సెంటర్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం.
– ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 16 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం.
– ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్–1994లో సవరణలకు కేబినెట్ ఆమోదం.
– ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం.
– ఏపీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్–2021 బిల్లుకు కేబినెట్ ఆమోదం.
– దేవాలయాల అభివృద్ధి, అర్చక సంక్షేమం కోసం కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం.
– కొప్పర్తిలో డిక్సన్ టెక్నాలజీస్కు 4 షెడ్ల కేటాయింపుతో పాటు ఇన్సెంటివ్లకు ఆమోదం.
– డిక్సన్ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్కు 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం.