తాడేపల్లి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మార్చి 7కు వాయిదా పడింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పెద్ద ఖర్మ దృష్ట్యా ఈనెల 3న జరగాల్సిన కేబినెట్ భేటీ 7వ తేదీకి వాయిదా వేశారు. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం పూర్తి అయిన అనంతరం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. 8న మేకపాటి గౌతమ్రెడ్డి మృతికి శాసనసభ సంతాపం తెలపనుంది.