అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆంద్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ వార్షిక నివేదికలను మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి సభ ముందు ఉంచనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అధికార భాష సవరణ బిల్లును మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సభ ముందు ఉంచనున్నారు. పలు బడ్జెట్ డిమాండ్ బిల్లులకు కూడా సభ ఆమోదం తెలపనుంది.