రెండో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

15 Mar, 2023 09:30 IST

అమ‌రావ‌తి: రెండో రోజు ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. ఇటీవల మరణించిన ఎమ్మెల్సీలు చల్లా భగీరథరెడ్డి, బచ్చుల అర్జునుడికి శాసనసభ సంతాపం తెలపనుంది.