విజయవాడ: ఇస్రోకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభినందనలు తెలిపింది. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, సభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని మనసారా ఆకాంక్షించారు.