పోలవరంలో సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే
6 Jun, 2023 10:34 IST
ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలిస్తున్నారు. అనంతరం పోలవరం పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రికార్డు సమయంలో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేసింది. కాఫర్ డ్యామ్ ఎత్తు 44 మీటర్లకు పెంచారు. 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యింది.