పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రభుత్వ విధానం వినూత్నం, ఆదర్శం 

5 Aug, 2022 12:52 IST

అమరావతి: పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రభుత్వ విధానం వినూత్నం, ఆదర్శంగా ఉందని నీతి ఆయోగ్‌ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంసించారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంతో ఏపీ ప్రభుత్వం తొలి  వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వంపై నీతి ఆయోగ్‌ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంసలు కురిపించారు. ఈవీ రంగంలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఏపీ దారి చూపుతుందని చెప్పారు. మౌలిక వసతులు, ఎలక్ట్రానిక్‌ మానుఫ్యాక్చరింగ్‌ రంగంపై ఏపీ దృష్టి అభినందనీయమన్నారు.